సత్కర్మలు ద్వైతం, ఆధ్యాత్మికం అద్వైతం
మీరు భజనలు చేస్తున్నారు, జపధ్యానములు సల్పుతున్నారు, యజ్ఞయాగాదుల నాచరిస్తున్నారు. ఇవన్నీ ప్రాకృతమైన ప్రవృత్తి మార్గములేగాని, నివృత్తి మార్గములు కావు. ఇవన్నీ కేవలం సత్కర్మలేగాని, ఆధ్యాత్మికమునకు సంబంధించినది. అయితే, మీరు ఎట్టి కర్మలు చేస్తారో అట్టి ఫలితము మీకు తప్పక లభిస్తుంది. అనగా, సత్కర్మలవల్ల మీకు సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ప్రాప్తిస్తుంది. కాని, ఆత్మకు సంబంధించిన ఫలితం రాదు. కనుక, మొట్టమొదట సత్కర్మలతో ప్రారభించి క్రమక్రమేణ ఆత్మసంబంధమైన మార్గంలో ప్రవేశించాలి. ఎంత కాలమైనప్పటికీ సత్కర్మలలోనే ఉంటే ఇంక మీరు ఆత్మతత్త్వాన్ని గుర్తించేదెప్పుడు? సత్కర్మలన్నీ ద్వైతంతో కూడినవి. కనుక, ద్వైతం నుండి అద్వైతంలోకి ప్రవేశించాలి. అప్పుడే జ్ఞానం ప్రాప్తిస్తుంది.
మూలం: సనాతన సారథిలోని శ్రీ సత్యసాయి బాబా వారి వాక్య విభూతుల నుండి.






ద్వైత్యం, అద్వైత్వం—- ఈరెండు పదాలకు వేరే అర్థమేమైనా ఉన్నదా ! లేక అచ్చు తప్పా!
చిలమకూరు విజయమోహన్
ఆగష్టు 17, 2009
ఇది అచ్చు తప్పే నండి. సవరించినందుకు ధన్యవాదములు.
saipraveen
ఆగష్టు 17, 2009
ఆధ్యాత్మిక లోకంలో వేసిన ఏ అడుగూ వృధా కాదు. అది ఇంకొక అడుగుకు పునాది అవుతుంది. మున్ముందుకు మనిషిని తీసుకెళుతుంది. జిడ్డు దియసఫీలో ఉన్నంతవరకూ చేసిన సాధన అంతా వృదాగానే గడిచింది. కాని దాన్ని పునాదిగా చేసుకొని చేసిన తన సొంత సాధన మాత్రం ఆయనకు అంతరిక లోతులు చూపించింది. కనుకనే ఆయన జీవితాన్ని సాధనా పరంగా చూస్తె రెండు భాగాలుగా కనిపిస్తుంది. మొదటి భాగం పెద్ద గొప్పగా ఏమీ ఉండదు. రెండో భాగంలోకూడా కొన్ని ఎత్తు పల్లాలు కనిపిస్తాయి. అంత మాత్రాన ఆయన ఒక మోసగాడని చెప్పటానికి వీల్లేదు. ఆయన ఉన్నతుడే. అందులో అనుమానం లేదు
అంతర్ముఖుడై తనను తాను పరిశీలించుకుంటూ, తన లోలోపలికి తానే మునిగి సత్యాన్ని ముఖాముఖి అనుభూతి చెందటమే జెన్. ఇందులో పూజలు జపాలు ధ్యానాలు గుళ్ళూ గోపురాలూ గ్రంధాలూ ఏవీ ఉండవు. ఇది శుద్దమైన జ్ఞానమార్గ సాధన. అందరూ దీనిని చెయ్యలేరు. దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. అటువంటివానికే ఇది సాధ్యమౌతుంది. తనకు తెలిసో తెలియకో జిడ్డు ఆ మార్గంలోకి ఆకర్షింప బడ్డాడు. ఆ మార్గంలో నడిచాడు. అదికూడా సహజంగా నడిచాడు. కనుకనే అద్భుతమైన అంతరిక కోణాలు లోకానికి ఇవ్వగలిగాడు. సహజంగా నడవటం అంటే ఏమిటి
సాధన ఒదిలిపెట్టి, తన సొంత సాధనలో తాను పురోగమించాడు. ఏమిటా సాధన అని చూస్తె, అది “జెన్” అని అర్ధమౌతుంది. జెన్ అంటే బౌద్ధ ధ్యానసాధన. దానికీ అద్వైత వేదాంత సాధనకూ పెద్ద తేడా లేదు. అద్వైతం (వేదాంత ధ్యానం) పాజిటివ్. జెన్(బౌద్ధ ధ్యానం) నెగటివ్. అంతే తేడా.
ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినంత మాత్రాన మనిషి పవిత్రుడై పోతాడనీ, రుషి గా మారతాడనీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విశ్వామిత్రుడు అంత తపశ్శక్తి సంపన్నుడై ఉండీ మేనక అందం ముందు దాసోహం అన్నాడు. ఇక , మొన్నటి ముక్తానందలూ, నిన్నటి రజనీషులూ, ఈనాటి నిత్యానందలూ సరే సరి. స్త్రీ వ్యామోహానికి లొంగని అసలు సిసలు మహనీయుల పేర్లు చెప్పాలంటే శ్రీ రామకృష్ణ, రమణ మహర్షి, వివేకానంద, షిర్డీ సాయిబాబా మొదలైన వాళ్ళ పేర్లే చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త జిడ్డు కి కూడా ఒక రహస్య జీవితం ఉందని తెలిస్తే అది దిగ్భ్రాంతిని కలిగించక మానదు.
ఇంద్రియ వ్యామోహాలకు పూర్తిగా అతీతుడై ఆత్మానుభూతిలో అనుక్షణం ఉండటాన్నే జీవపరిణామంలో అత్యుత్తమ స్థాయిగా భారతీయ వేదాంతం అభివర్ణించింది. దానికి తక్కువ అయిన దేనినీ భారతీయులు గోప్పతనంగా పరిగణించరు. ఇక్కడే ఉత్త పండితులకూ, నిజమైన మహాత్ములకూ తేడా అనేది కనిపిస్తుంది. ఒకడు వేదాలను బట్టీ పట్టవచ్చు. కాని అతనికి ఆత్మానుభవం లేకపోతే అది ఔన్నత్యం కిందికి రాదు. గొప్ప వేదాంతాన్నీ, తత్వ శాస్త్రాన్నీ బోధిస్తూ ఒకడు మంచి ఉపన్యాసాన్ని ఇవ్వవచ్చు. కాని అతను స్వయానా తన ఇంద్రియ ఆకర్షణలకు అతీతుడు కాకపోతే అతని పాండిత్యం అంతా ఎందుకూ పనికిరాని చెత్త అవుతుంది.
ఈ కోణంలో చూచినపుడు, జిడ్డు స్థాయి జర్రున దిగజారి పోతుంది. దానికి కారణం ఏమిటో, ఇటువంటి పరిస్తితి ఎందుకు రావలసి వచ్చిందో దానికి గల జ్యోతిష్య కారణాలేమిటో వచ్చే పోస్ట్ లో చూద్దాం.
గురువు మీద శిష్యునికి ఉన్న భక్తి మంచిదే. కాని అది స్వాతంత్ర్యానికి దారి చూపాలి. బానిసత్వానికి కాదు. గురు శిష్యుల బంధం ఒక లవ్ ఎఫైర్ లాటిది. ఇద్దరి లోనూ ఒకే హృదయమే స్పందిస్తుంది.ఇద్దరి భావాలూ ఒకే విధంగా మారిపోతాయి. వేల మైళ్ళ దూరాన ఉన్నా ఒకరి భావాలు ఒకరిలో ప్రతిస్పందిస్తాయి. అదే నిజమైన గురుశిష్య బంధం. అటువంటి ప్రేమ ఉన్నచోట శిష్యునికి ఆత్మోన్నతి అతి శీఘ్రంగా కలుగుతుంది. గురువు ఆత్మస్తితుడే, కనుక గురువు పైన ఉన్న ప్రేమవల్ల ఆ స్థితి శిష్యునికి కూడా అలవోకగా కలుగుతుంది. అటువంటి స్తితిని పొందమని ఓషో ఈ ఉత్తరం లో సూచిస్తున్నాడు
rathnam.sjcc
డిసెంబరు 30, 2011
శరీరము లో . 24. ఇరవై నాలుగు తత్వాలతో కలిసి మాయఓ మనసా! • మాయ తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు శరీరము లో మనస్సు,బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మ .అంటారు. . అంటారు. )శరీరం లోపల,మనం బయట చూస్తున్న ప్రకృతి అంతటా వ్యాపించివున్న యోగులు ఆ ఆత్మ సూక్ష్మ మై చైతన్యం అమృతము అంటారు. ఆత్మ అంటారు. సూక్ష్మ తత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను మనసు వాయివునిగ్రహించి జయిస్తాడు. యోగి దృఢమైన మనసుతో భయాన్ని జయిస్తాడు. ఏ ఒక్క ఇంద్రియము అదుపు తప్పినా యోగి యొక్క ప్రజ్ఞ మొత్తము నాశనం ఔతుంది. కనుక ఇంద్రియములమనసు అదుపులో ఉంచుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి.
ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు, లోభములను పక్కన పెట్టే నేర్పు, దృఢమైన విద్య వీటి వలన కూడా పురుషుడు బ్రహ్మ పదమును పొంద వచ్చుప్రయత్న మీద ఇంద్రియములను నిగ్రహించ వచ్చు. మనస్సును నిగ్రహిస్తే ఇంద్రియము పని చేయడము మానివేస్తాయి. అప్పుడు బ్రహ్మప్రాప్తి పొందడము సులువు. బుద్ధి మన కనిపించదు, వినిపించదు కాని బుద్ధివలన మనము పరమాత్మను చూడగలము తెలుసుకోగలము
చరాచరజగత్తులో అన్ని జీవరాశుల అందు భగవంతుడు ఆత్మ స్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ అందు అన్ని జీవరాశులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న వాడు పరబ్రహ్మపదమును పొందగలడు.
శరీరము మృత్యువు పొంచి ఉంటుంది యోగి మాత్రమే తెలుసుకోగలడు అమృతము. మరాణానంరము పొందే స్వర్గ లోక అదియే అమృతము. పండితుడైన వాడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఈ లోకాలను కాలము శాసిస్తుంది. కాలమును జయించిన వాడు పరబ్రహ్మ పదమును పొందగలడు.
rathnamsjcc
డిసెంబరు 31, 2011