పెద్దల మాట - సద్ది మూట

స్వదేశీ

Posted on జులై 10, 2009. Filed under: పెద్దల మాట - సద్ది మూట | Tags: , , , |

స్వదేశీ అంటే ఏమిటి? భారతదేశ తొలి నోబెల్ పురస్కార గ్రహీత, గీతాంజలి కావ్య రచయిత, శాంతినికేతన్ విద్యాసంస్థల నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ అనే భావానికి సరైన నిర్వచనం తెలిపారు.
“వందేమాతరం యొక్క మరో రూపమే స్వదేశీ. కొన్ని స్వదేశీ వస్తువులను కొనటం, కొన్ని విదేశీ వస్తువులను బహిష్కరించడం వరకూ మాత్రమే స్వదేశీ పరిమితం కాదు. స్వతంత్ర భారతదేశ ఆత్మతో సంబంధమున్న శబ్దమే స్వదేశీ. స్వాభిమానం, స్వావలంభన, సార్వభౌమత్వం కలిగిన భారతదేశానికి గుర్తు స్వదేశీ.”

Read Full Post | Make a Comment ( 2 so far )

వినదగునెవ్వరు చెప్పిన……

Posted on జులై 3, 2009. Filed under: పెద్దల మాట - సద్ది మూట | Tags: , , , , , , , , , , , |

వినదగునెవ్వరు చెప్పిన వినాలి. ఈ అలవాటును నేను మా స్వర్గీయ తాతగారి నుంచి అలవరచుకున్నాను. ఈ‌ లక్షణం ఎంత ఉత్తమమైనదో, మీకు ఓ రెండు ఉదాహరణలతో వివరిస్తాను.

అది శ్రీరామచంద్రునికి, రావణాసురునికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్నవేళ. రావణుని రావణబ్రహ్మ అని కూడా అంటారు. అతను సకల విద్యాపారంగతుడు. కానీ పర స్త్రీ వ్యామోహం అనే దుర్గుణం, అతనితో పాటు అతని బంధుగణం, సమస్థ రాజ్యం యొక్క వినాశనానికి దారితీసింది. ఆ మహా సంగ్రామంలో‌  రావణుడు, శ్రీ రాముని [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

ఆకులో భోజనం ఎందుకుచేయాలి?

Posted on జూన్ 13, 2009. Filed under: ఆరోగ్యం, పెద్దల మాట - సద్ది మూట | Tags: , , |

భోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు.
పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి [...]

Read Full Post | Make a Comment ( 15 so far )

Liked it here?
Why not try sites on the blogroll...