వీళ్ల గురించి ఆలోచించడం అవసరమా?!
Posted on ఆగస్ట్ 14, 2009. Filed under: దేశ భక్తి | ట్యాగులు:ఆస్ట్రేలియా, జెండా పండుగ, తెలంగాణ, తెలుగుదేశం, దేవందర్ గౌడ్, ప్రజలు, బురద, విజయశాంతి, స్వాతంత్ర్యం, barbeque, kcr, trs |
రాములమ్మ(విజయశాంతి) తెలంగాణ కొరకు ఒక పార్టీని పెట్టింది, తర్వాత గద్దముక్కాయన(కే.సి.ఆర్) పార్టీలో విలీనం చేసింది. మరి ఇప్పుడు ఆ పార్టీను కూడా వీడింది. అసలు ఆమె తెలంగాణ కోసం ఏమి చేస్తున్నట్టు?!
దేవందర్ గౌడ్ తెలుగుదేశం వద్దని నవ తెలగాణ పార్టీని పెట్టాడు, ఆ పార్టీ నవ్యత్యం కోల్పోకుండానే మెగాస్టార్ పార్టీలో విలీనం చేశాడు. కాని, ఇప్పుడు ఏమైందో ఏమిటో తిరిగి సొంత గూటికి చేరాడు. అసలు ఇంత తతంగం ఎందుకు?!
అసలు వీరికి ప్రజల కంటే తెలంగాణ ముఖ్యమైందని నేను చాలా సార్లు వాపోయాను, కాని ఇప్పుడు వాళ్లు తెలంగాణ గురించి కూడా పట్టించుకోకపోవడం విడ్దూరంగా ఉంది.
అయినా చిన్న చేపలు ఏమిచేస్తాయిలే అని వారిని వదిలేద్దాం. మరి బడా చేపలు ఏమిచేస్తునట్టు అని తొంగి చూస్తే:
తొంగిచూసేంతగా అక్కడ ఏమిలేదని తెలుసుకున్నా (నిజంగా). ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవడాన్ని పూర్తిగా ప్రక్కకు నెట్టి, ఒకరి మీద మరొకరు బురద చల్లుకోవటానికే సమయం కేటాయిస్తున్నారు. మన సొమ్ముతో దర్జాగా బతికేస్తున్నారు.
ఇటువంటి వారి గురించి ఆలోచించడం అవసరమా? అని నేను చాలా సార్లు అనుకునేవాడిని. కాని నిన్న నాకు జ్ఞానోదయం అయ్యింది. అసలు జరుగుతున్నది ఏమిటంటే, నాయకులు ప్రజల గూర్చి “వీళ్ల గురించి ఆలోచించడం అవసరమా?!” అని నిర్ణయించేసుకున్నారని. దీన్ని ఇలాగే వదిలేద్దమా అని అనుకుంటే మనసు ఊరుకుండడం లేదు. రేపు మన జెండా పండుగ. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా మన అభివృద్ధి నత్త నడక నడుస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి?
కొసమెరుపు: మన దేశం ఇంతే అని సర్దుకుపోయేవారు రోజుకు రోజు అధికమవుతున్నారు. దీనితో ఆగక కొంత మంది ఇక్కడ భవిష్యత్తు లేదని విదేశాలకు వెళ్లిపోతున్నారు కూడా. ఒక నెల క్రితం నా మిత్రుడు ఒకడు, బెంజు మరియు బి.యమ్.డబ్ల్యు కార్లు వీలైనంత త్వరగా కొనాలని, వారాంతాలలో పార్టీలు చేసుకోవాలని మరియు barbequeల కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు.
Read Full Post | Make a Comment ( 3 వ్యాఖ్యలు )