నా విసుర్లు
ప్రతి నరుడు – ఓ నటుడు
రంగస్థలంపై నటించిన వారిని అందరు చూస్తారు. ఆ నటుల అభినయాన్ని అభిమానించేవారు వారు కొందరైతే, ఆరాధించేవారు కొందరు. వ్యాఖ్యానించేవారు కొందరైతే, ఆక్షేపణ తెలిపేవారు కొందరు. వెండితెర నటులుపై ఎన్నో రచనలు, బ్లాగులలో టపాలు వున్నాయి. వాటికి భిన్నంగా రోజూ మన చుట్టూ వుండే నిజ జీవిత నటుల గురించి ప్రస్తావించాలని నేను నిశ్చయించాను.
ఈ నిజ జీవిత నటులు ఎవరని అలోచిస్తున్నారా?! ఈ భువిపై నివసించే ప్రతి నరుడు, నటుడే. వెండితెరపై అందరు మెరవలేరు, కాని జీవితం అనే రంగస్థలంపై తమ అభినయ ఛాతుర్యాన్ని ప్రదర్శించి తళ్ళుక్కుమన్నవారు కోకొల్లలు. మన చుట్టూ వున్న వారు ఎలా నటిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక్క రోజు వెచ్చించండి. ఆ ఒక్క రోజు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనించండి. అప్పుడు మీకు తెలిసిన వారు, మీతో కలియతిరుగుతున్న వారు ఎలా నటిస్తున్నారో, ఎందుకు నటిస్తున్నారో తెలుస్తుంది.
అందరూ ఎల్లాప్పుడు నటించరు. నా వుద్దేశంలో నటించడం అంటే, ఒక వ్యక్తి తను తానులా ప్రవర్తించక కాస్త లేక పూర్తి భిన్నంగా ప్రవర్తిచడం. మనకు తెలిసో తెలియకో మనము కుడా ఇటువంటి పనిని ఎన్నో మార్లు చేసి వుంటాం. ఇటువంటి నటన సబబేనా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం ఎంతో కష్టము. ప్రతి వొకరికి, వారి కారణాలు అవసరాలు వుంటాయి. వాటిని తప్పుబట్టలేం, అలాగని ఎల్లప్పుడు స్వీకరించలేం. మనకు హాని కలగనంత వరకు, వాటిని అంగీకరిస్తాం. అలా కాని పక్షాణ, వాటికి తిరస్కరిస్తాం. మనుషుల పలు సహజమైన ప్రవర్తనలలో ఇదొకటి.
మీలోను ఒక నటుడు/నటి ఉన్న వాస్తవం మరవకండి. ఈ క్షణం నుండే మీ నటనా చాతుర్యాన్ని సానబెట్టండి.
Read Full Post | Make a Comment ( 1 so far )వింత జీవితం
అనుకున్నది ఒక్కటి… అయినది ఒక్కటి… ఇది ఎప్పుడూ ఉన్నటువంటి తంతేగా?! మీరు అవునని అన్నా, కాదని అన్నా, ఇది అంతే. జీవితం ఒక వింత.
మన చిన్ని గుండెకు ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. కాని అన్నీ నెరవేరవు కదా. అది తెలియక చాలా మంది పేక మేడలు కట్టేస్తుంటారు. ఆ మేడ కూలడం ఖాయమని తెలిసినను, ఆ ప్రయత్నం విరమించుకోరు. తీరా, అది కూలిన తర్వాత నిరుత్సాహ పడటం తప్పటంలేదు. ఇది ఒక ఛత్రము వంటిది. ఇటువంటి ఛత్రాలు కోకొల్లలు. ఇది ఎప్పుడో ఒకప్పుడు కచ్చితముగా అందరికీ జరుగుతూనే ఉంటున్నది. ‘ఎలా’, ‘ఎందుకు’ అనే వివరాలలోకి నేను వెళ్ళుటకు సాహచించను. కొన్నింటిని అలా వదలివేయటం మంచిది.
అనుకోకుండా కొందరిని కలుసుకుంటుంటాం; కొన్ని క్రొత్త అలవాట్లు చేసుకుంటుంటాం. మన ఇష్టాలతో పనిలేకుండా, మన ఆశలతో పొంతనలేకుండా, పలు సంగతులు మన జీవితంలో జరిగిపోతుంటాయి. అసలు ఎందుకలా జరుతుందని ఆలోచిస్తే సమాధానాలు దొరకవనే అనుకుంటున్నను.
మానవ జీవితంలో ఇన్ని వింతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో తెలియటం లేదు. కాని సమాధానము కోసం దేశాటనం చేయటం, దట్టమైన అరణ్యాలలో వణ్య మృగముల మధ్య కూర్చొని ధ్యానం చేయటం, పెళ్లి చేసుకోకుండా భోగ భాగ్యాలకు దూరంగా వుంటూ సాధన చేయటం నాకు చేతకాని పని. నాకు తెలిసినదంతా ఒక్కటే.. ఈ జీవితం చాలా వింతది. ఆ వింత ఎందుకని ఆరా తీసేవాడిని ఈ లోకం వింతగా చూస్తుంది. మరి మీరేమంటారు?!
Read Full Post | Make a Comment ( 1 so far )నిజం కావాలా ?!
నిజాన్ని దాయటానికి, నిజం చెప్పకపోవటానికి గల వ్యత్యాస్యం కనుగొనడం నా తరమా? ‘నిజం’ – మన జీవితాలతో బాగా పెనవేసుకుపోయిన ఒక ముఖ్యమైన వస్తువు/విలువ. నిజం మాత్రమే పలకడం కొందరి వైనం; నిజాన్ని అస్సలు బయటపెట్టక పోవటం కొందరి నైజం.
‘ అతడు ‘ చిత్రములో కథానాయకుదు ఇలా అంటాడు.. ‘ నిజం చెప్పకపొవటం అబద్దం; అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. దీననుసారం, నిజం దాయటం ఎమని అనిపించుకుంటుంది. నానుండి నిజాన్ని దాచే ప్రయత్నం చేసారు, అసలు విషయాన్ని వక్రీకరించారు. మెల్లగా అసలు విషయమేమిటో బయటపడసాగింది. ఇటువంటి పనిని సమర్థించుకోవడమే కాకుండా, నాతో కుడా ఈ నీచమైన (నా అనుసారం) పనికి ఒడిగట్టమని ఆదేశించారు కూడా.
కొన్నిమార్లు నిజం చెప్పకపోవటం మంచి చేస్తుందంటారు. ఇతరులకు అది మేలు చేస్తుంది అని అనుకున్నప్పుడు అబద్దమాడటంలో తప్పులేదని అంటారు. స్వలాభం కోసం అదే పని చేసేవారిని ఏమనాలి. ఎంత విచిత్రమైన పద్దతులు మనవి. సందర్భానుసారంగా విలువలను కూడా మార్చేస్తాం. ప్రాధమిక విలువలకే, వెలువలేకుండా పోతున్నది.
‘ నాకు నిజం కావాలి. నిజం మాత్రమే కావాలి ‘, అని ఆడగటం మూర్ఖత్వంగా భావింపబడుతున్న ఈ రోజులలో, అలా కోరేవారు చాలా తక్కువ, కోరినా వాటిని పొందిన వారు అతి తక్కువ. ఆ దేవుడే మనలను రక్షించు గాక.
Read Full Post | Make a Comment ( None so far )వై.యస్. రైతు బాంధవుడా?! బహుశా కావచ్చేమో
నేను ఇదివరకే నా బ్లాగులో వై.యస్. ఇక లేరు అని ఒక టపా వ్రాసి, అందులో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరాను. వై.యస్. ఎలాంటి వారు అనేదానిని ప్రక్కన బెడితే, ఒక ముఖ్యమంత్రికి ఇటువంటి ప్రమాదం జరిగిందని నేను విచారించాను.
ఆయన చనిపోయినప్పుడు, మీడియా అంతా ఆయనను రైతు బాంధవుడని, పుడమి తల్లి కన్న రత్నమని చెప్పారు. ఒకవేళ మాహాత్ముడు కూడా ఇన్నాళ్లు బ్రతికి వుండి, వై.యస్. మరణించిన రోజే గనక గతించివుంటే, ఆయనకు వై.యస్.కు లభించిన ఆదరణ లభించకపోవచ్చని అనుకుంటాను.
రైతు పక్షపాతి, స్వర్ణాంధ్ర రూపకర్త, జల ధాత, ఆరోగ్య శ్రీ ప్రదాత అని పలువిధాలుగా మన మీడియా ఆయనను అందలాలకు ఎక్కించింది. వై.యస్. చనిపోయిన నాడు, నా మిత్రులు పలువురు దుఃఖంలో కూరుకుపోయారు. ఆయనను ఒక మాహాత్ముడని భావించారు.నాకది చాలా బాధ కలిగించింది. ఈ నేపథ్యంలో నాలాగే ఆలోచించే కొందరు మిత్రులు నాకు ఈ క్రింది లంకె(link)లను నాకు అందించారు. వాటిలో వై.యస్. యొక్క నిజ జీవిత చరిత్ర, ఆయన ఈ స్థాయికి ఎదిగిన తీరు చాలా చక్కగా వివరించారు. సమయభావం చేత వాటిని తెనుగీకరించడం కుదరలేదు. ఈ మహనీయుడి దివ్య గాధను చదవండి, చదివించండి.
Andhra Pradesh: Beyond Media Images
Read Full Post | Make a Comment ( 5 వ్యాఖ్యలు )దూరం దగ్గరైంది – దగ్గర దూరమైంది
ఒకానొక తమిళ ఛానలును నేను వీక్షిస్తుండగా, ఒక కొరియర్ సర్వీసు ప్రకటన నన్ను ఆకట్టుకుంది. ఆ ప్రకటనలో ఒక కంపెనీ యజమాని తన ఆంతరాంగిక సహాయకురాలతో(personal assistant) వివిధ ప్రదేశాలకు చేరవేయవలసిన కొరియర్ల గురించి చర్చిస్తూ వుంటాడు. అందులో చాలా కొరియర్లు దూర ప్రదేశాలకు, విదేశాలకు చేరవేయవలసి వుంటుంది. కాని, ఒకటి మాత్రం ఏదో కుగ్రామంకు చేరవేయవలసి వుంటుంది. అప్పుడు ఆ యజమాని తన ఆ.స.(P.A.)తో ఈ కొరియర్ తన గమ్యం చేర్చటం కుదరదు కదా అని అంటే, దానికామె మనము వాడే కొరియర్ సర్వీసు ఎక్కడికైనా మన వస్తువులను చేరవేయగలదు సార్ అని చెప్తుంది.
అవును కదూ, ఇప్పుడు మన సాధించిన పురోగతి మరియు సమాచార విప్లవాల వలన, మనోళ్ళు ఎక్కడ ఉన్నా , వాళ్ల స్థితిగతులు చాలా సులువుగా తెలుసుకోగలుగుతున్నాము మరియు వారితో సంభాషించగలుగుతున్నాము. ఇంకా అంతర్జాలం(internet) పుణ్యామా అని క్రొత్త మిత్రులను సంపాదించుకోగలుగుతున్నాము. ఉన్న చోటనే దేశ, విదేశ వార్తలను తెలుసుకుంటున్నాము. ఏవైనా సంఘటనలు జరిగితే, దాన్ని చిటికలో అందరికి చేరవేయగలుగుతున్నాము. దీని ద్వారా ఈ ప్రపంచం రోజురోజుకు చాలా చిన్నదౌతూవస్తున్నది.
ఇది సంతోషించ దగ్గ పరిణామమే కదా!! కాని, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు, దగ్గరను దూరంచేసుకుంటున్నాము. ప్రస్తుత సమాజంలో మనిషి తన పరిసరాలను పట్టించుకోవటం లేదు. తన పొరుగువారి బాగోగులు చూడటంలేదు. పోని, కనీసం తన నివాస పరిసరాలలో ఎవరుంటున్నారన్నది కూడా తెలుసుకోలేకున్నాడు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం. దూరము దగ్గరైతే మంచిదే. కాని, అందుకు దగ్గరను దూరము చేసుకోవటం ద్వారా మూల్యం చెల్లించటం ఎంత వరకు సమంజసం?!
Read Full Post | Make a Comment ( 7 వ్యాఖ్యలు )తిరిగులేని మెగా సీరియల్ – అసెంబ్లీ
కనీ వినీ ఎరుగని రీతిలో మన ఆంధ్ర ప్రజల సంతోషం కొరకు, భారి బడ్జెట్తో మన ప్రభుత్వం మనకు సమర్పిస్తున్న మెగా సిరియల్……
పేరు : అసెంబ్లీ
ప్రసారం : అన్నీ వార్తా ఛానళ్లు (live & exclusive)
అన్నీ తెలుగు ఛానళ్లు(exclusive)
దిన పత్రికలు
సమయం : కచ్చితముగా చెప్పలేము ( ఒకవేళ మొదలైనా నిరసనలు మరియు వాకౌట్ల వల్ల ఆగిపోవచ్చు)
నిర్మాత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దర్శకుడు : గౌ॥స్పీకరు గారు
తారాగాణం :
హీరో : డా॥వై.యస్.రాజశేఖర్ రెడ్ది
విలన్ : నారా చంద్రబాబు నాయుడు
(గమనిక: హిరో మరియు విలన్ ప్రతీ ఐదు సంవత్సరములకు ఒకమారు మారుతూవుండవచ్చు.)
సైడ్ హీరో/విలన్ : మెగాస్టార్ చిరంజీవి
ముఖ్య పాత్రధారులు : మంత్రులు, ప్రతి పక్ష నాయకులు మరియు లోకసత్తా వ్యవస్థాపకులు డా॥జే.పి గారు
అతిథి పాత్రలలో : మంత్రి పదవి రాని MLAలు మరియు ప్రతి పక్షంలో కొందరు.
కథ:
మొత్తం కథను ఇక్కడ ప్రస్తావించడం చాలా కష్టం. సర్వర్లలలో స్థలభావం చోటుచేసుకున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఎన్నికలలో ఓటు వేసి ఎన్నుకున్నవారు, అసెంబ్లీలో WWFలో మాదిరి కుమ్ముకోవటం(వాళ్లలో వాళ్లను కుమ్ముకోవటం కావచ్చు, లేక వారికి అనుకూలముగా బిళ్లులను పాస్ చేసి, చట్టాలను రూపొందించి ప్రజల డబ్బును కుమ్మటం కావచ్చు).
కృతజ్ఞతలు:
రాష్ట్ర ప్రజలు – ఈ తానా తందానాలను; గానా భజానాలను రూపొందిచడానికి పన్ను రూపంలో డబ్బులిచ్చి సహకరిస్తునందుకు, ఓట్లు వేసి మరి తారాగాణాన్ని ఎన్నుకున్నందుకు, అతి ముఖ్యముగా ఇంత కర్చుచేసి కూడా ఈ సీరియల్ను వీక్షించనందుకు.
ఇది
మన రాష్ట్ర ప్రజల సౌజన్యముతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి సమర్పణ
Read Full Post | Make a Comment ( 14 వ్యాఖ్యలు )ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!
క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను.
తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, సి.డి.లు తయారీకి అయ్యే ఖర్చులు ప్రవాసాంధ్రులు అందజేస్తారని ఈ విషయాన్ని ప్రభుత్వానికి లేఖ ద్వారా తెపుపుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్త చదివాక, ప్రవాసాంధ్రులకు మన మాతృభాష మీద ఉన్న మమకారాన్ని చూచి ఆనందించాలా లేక ఆంధ్ర రాష్ట్రంలోనే వుంటూ మన తెలుగు దినపత్రికలను కూడా చక్కగా చదవలేని నేటి తరాన్ని చూచి సిగ్గుపడాలా అనే సంధిగ్ధంలో పడ్డాను.
Read Full Post | Make a Comment ( 4 వ్యాఖ్యలు )మన్మోహనుడి దేశ(స్వామి) భక్తి
మన్మోహనుడి దేశ స్వామి భక్తి:
నిన్న ప్రొద్దున, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని జెండా ఆవిష్కరణ మరియు దేశ ప్రజలకు అందించే సందేశాన్ని చూడాలని దూరదర్శన్ ఛానల్ పెట్టాను. జెండా ఆవిష్కరణ మరియు పెరేడ్ను చూడలేకపోయాను, అయినా నేను చాలా ఆసక్తిగా ఎదురుచూచిన ప్రధాని సందేశ సమయానికి t.v. పెట్టానని ఆనందించా. చిన్నప్పుడు మా నాన్న మన్మోహన్ సింగ్ 90లలో విత్తమంత్రి గా పనిచేసిన రోజులలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చాలా కీలకమైనవి అని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడింది. కాని, నిన్నటి సందేశాన్ని విన్నాక ఆయన మీద నాకున్న అభిమానం నీవా నదిలో కొట్టుకుపోయింది.
“నాకు మరల ఈ అవకాశాన్ని ఇచ్చిన భారత దేశ ప్రజలకు ధన్యవాదములు. గడిచిన సార్వభౌమిక ఎన్నికలలో ప్రజలు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గాంధీ, ఇందిరమ్మ మరియు రాజీవ్ చూపిన బాటలో నడుస్తూ, వారి కలను నెరవేర్చడానికి కట్టుబడి వున్నా”మని ప్రధాని తన సందేశాన్ని మొదలుపెట్టారు. నాకైతే ఆయన మాటలలో దేశభక్తి కన్నా స్వామిభక్తి పాళ్లు ఎక్కువ కనిపించింది. నెహ్రూ కుటుంబం మన దేశానికి చేసిన మేలు కంటే, నష్టమే ఎక్కువ. తెల్లవాళ్ళు కూడా మనకు రైళ్ల రవాణా వ్యవస్థను అందించారు, కొన్ని పెద్ద పెద్ద డాం లను, బ్రిడ్జిలను నిర్మించారు. కాని, అవన్నీ వారి స్వార్థ నిమిత్తం చేసారు. అంతమాత్రాన వాళ్ళు మనకు మేలు చేసారని భావిస్తామా? అప్పుడు తెల్లదొరలైతే, ఇప్పుడు నల్లదొరలు దోచుకుంటున్నారు. స్వాతంత్ర్యయానికి ముందు-తర్వాత కు తేడా ఇదే. మన రాజకీయాలు ఒక కుంటుంబ వ్యాపారంగా, పెత్తందారీతనంగా తయారవడానికి బీజం వేసినది, పెంచి పోషించినది నెహ్రూ కుటుంబమే. నెహ్రూ కుటుంబీకుల పేర్లకు గాంధీ అనే తోక రావటమే ఒక ***** కథ.(ఇక్కడ నేను ‘*’లు వాడడానికి కారణం, అక్కడ సరైన పదం నాకు దొరక్కపోవడమే. మరే అర్థాలను స్పురింపచేయడానికి కాదు.)
ప్రధాని సందేశంలోని కొన్ని ముఖ్య అంశములు:
* అక్రమ సరకు నిల్వదారులను మరియు రవాణాదారులను వారించడం.
* ఎవ్వరూ ఆకలిని అనుభవించరు.
* స్వైన్ ఫ్లూ చూసి బయపడవలసిన పనిలేదు.
* ప్రతి భారతదేశ పౌరుడు సౌభాగ్యం మరియు భద్రతను అనుభవిస్తూ, గౌరవమైన జీవితాన్ని గడపాలి.
* మనకు సరపడ్డ ఆహార నిల్వలు వున్నాయి. ధాన్యం, పప్పులు మరియు నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తాము.
* మురికి వాడల నిర్మూలన కొరకు రాజీవ్ ఆవాస్ యోజన.
* సోలార్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహించి ఊతమందించేందుకు, జవహర్లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్.
* నక్సలిజానికి, తీవ్రవాదానికి చమరగీతం పలకటం.
* అణగారిన వర్గాలు, మైనారిటీల సంక్షేమం కొరకు ప్రత్యేక పథకాలు.
* అవినీతిని అంతమొందిచి, ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయటం.
* పన్నుదారుల సొమ్ము సరిగ్గా ఉపయోగపడేలా చూడటం.
* దేశ నిర్మాణమే ప్రధాన లక్ష్యం.
ఇంకా మరెన్నో…
ప్రధాని హామీలు ఇవ్వటం ఒక విశేషమైతే, అవి మన ప్రభుత్వం ఆచరణలో పెట్టలేని పనులు కావటం మరో విశేషం. అక్రమాలను ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ప్రోత్సహించే మన ప్రభుత్వ తీరు, విభజించి పాలించు అనే తెల్లవాళ్ళ సిద్ధాంతాన్ని పాటించడం, ప్రజలకు అతి ముఖ్యమైన విద్య-వైద్య-ఆహారాన్ని అందించడానికి కావలసిన చిత్త శుద్ధి లోపించడాన్ని మనము చవి చూస్తున్న తరుణంలో ప్రధాని దేశ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తారని, యువతను ఉత్సాహ పరుస్తారని నేను భావించాను. కాని అది జరగలేదు. ప్రధానికి దేశ భక్తి కన్నా, స్వామి భక్తే ఎక్కువని నిరూపించుకున్నారు. ఆయన హామిలను చూస్తుంటే నాకు ముందు నవ్వోచింది, తర్వాత బాధేసింది, చివరన ఆయన మీద అసహ్యం మొదలైంది.
ఉజ్వలమైన భారతదేశ నిర్మాణం కొరకు మనమందరము పూనుకోవాలి. అందుకు రాజకీయ ప్రక్షాలనే ప్రధాన మార్గం. పవిత్ర రాజకీయాలను బురద గుంటలుగా తయారు చేసిన వారిని ఏరిపారేయాలి. మన సత్తా ఎంటో చాటాలి. జై భారతమాత!! జై హింద్!!
Read Full Post | Make a Comment ( 7 వ్యాఖ్యలు )